Friday, January 21, 2011

నాలుగో వన్డేలో భారత్ ఓటమి


పోర్ట్ ఎలిజబెత్,జనవరి 21: నాలుగో వన్డేలో భారత్  దక్షిణాఫ్రికా పై 48 పరుగుల తేడా తో ఓడింది.లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్‌ను కష్టాలతో పాటు వర్షం కూడా వెంటాడింది. రెండు సార్లు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 48 పరుగుల తేడా తో ఓడింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. వర్షంతో ఆటనిలిచే సమయానికి భారత్ 32.5 ఓవర్లలో 142/6 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (87 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ మూడు వికెట్లు, నెహ్రా ఓ వికెట్ తీశాడు.ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు కావడం విశేషం.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...