నాలుగో వన్డేలో భారత్ ఓటమి


పోర్ట్ ఎలిజబెత్,జనవరి 21: నాలుగో వన్డేలో భారత్  దక్షిణాఫ్రికా పై 48 పరుగుల తేడా తో ఓడింది.లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్‌ను కష్టాలతో పాటు వర్షం కూడా వెంటాడింది. రెండు సార్లు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 48 పరుగుల తేడా తో ఓడింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. వర్షంతో ఆటనిలిచే సమయానికి భారత్ 32.5 ఓవర్లలో 142/6 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (87 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ మూడు వికెట్లు, నెహ్రా ఓ వికెట్ తీశాడు.ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు కావడం విశేషం.


Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు