ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

న్యూఢిల్లీ,జనవరి 18: భూకంప ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి 1.55 ని.లకు ఉత్తర భారతం ఒక్క నిముషం పాటు వణికింది. బెలుచిస్తాన్ కేంద్రంగా భూమి కంపించడంతో దేశ రాజధానితో పాటు పలు నగరాలలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. న్యూఢిల్లీ,జైపూర్, నోయిడా, గుర్గావ్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. కాగా పాకిస్తాన్ , ఇరాన్‌లలో కూడా భూమి కంపించినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు