Tuesday, January 18, 2011

ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

న్యూఢిల్లీ,జనవరి 18: భూకంప ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి 1.55 ని.లకు ఉత్తర భారతం ఒక్క నిముషం పాటు వణికింది. బెలుచిస్తాన్ కేంద్రంగా భూమి కంపించడంతో దేశ రాజధానితో పాటు పలు నగరాలలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. న్యూఢిల్లీ,జైపూర్, నోయిడా, గుర్గావ్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. కాగా పాకిస్తాన్ , ఇరాన్‌లలో కూడా భూమి కంపించినట్లు సమాచారం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...