విశాఖపట్నం,,జనవరి 22: కాంగ్రెసు పాలనకు స్వస్తి పలకాలని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ధరల పెరుగుదలపై నిర్వహించిన జనదీక్ష కార్యక్రమంలో ప్రసంగిస్తూ, మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే పట్టించుకునేవారు లేరని, వైయస్సార్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని, ఎన్డియేకు మద్దతిచ్చారని, పెట్రోల్ ధరలు పెంచినా పట్టించుకోలేదని, రాష్ట్రంలో పేద ప్రజల గురించి కూడా ఆలోచన చేయలేదని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు నాలుగు సార్లు, బస్సు చార్జీలు మూడు సార్లు చంద్రబాబు పెంచారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనిషన్నవాడు ఒకే రకంగా ఉండాలని, అమ్మకం పన్నును చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా పెంచాడని, ఇప్పుడు అమ్మకం పన్ను తగ్గించాలని అంటున్నారని ఆయన అన్నారు. కృష్ణా - గోదావరి బేసిన గ్యాస్ విషయంలో చంద్రబాబు మోసం చేశారని, బిడ్డింగులో పాలుపంచుకోకపోవడమే చంద్రబాబు చేసిన అన్యాయమని ఆయన అన్నారు. బిడ్డింగులో పాల్గొని ఉంటే వంద రూపాయలకో వంద యాభై రూపాయలకో గ్యాస్ వచ్చి ఉండేదని ఆయన అన్నారు. మునుపటి చంద్రబాబు పాలన, ఇప్పటి కాంగ్రెసు పాలన దొందూ దొందేనని, విశ్వసనీయత, విలువలపై ఏ ఒక్కరికీ పట్టడం లేదని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment