Friday, January 28, 2011

ఇండియాకు యాపిల్ ఐప్యాడ్

న్యూఢి ల్లీ,జనవరి 28: :యాపిల్ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. శుక్రవారం దీన్ని దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్స్‌లో ఆరు వెర్షన్లలో ఐప్యాడ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 16జీబీ, 32జీబీ, 64జీబీ వెర్షన్స్ ఉంటాయి.ఐప్యాడ్ ప్రారంభ రేటు రూ.27,900 (వైఫై, 16జీబీ) కాగా గరిష్ట రేటు రూ.44,900 (వైఫై+3జీ+64జీబీ) ఉంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఐప్యాడ్ కోసం ప్రత్యేకంగా 3జీ ప్లాన్స్ను ప్రకటించింది. దీని ప్రకారం టారిఫ్‌లు రూ.99 (అన్‌లిమిటెడ్ డైలీ యూసేజ్), రూ. 599 (నెలకు 6జీబీ ఉచితం), రూ.999 (అన్‌లిమిటెడ్ మంత్లీ యూసేజ్) ఉంటాయి. ల్యాప్‌టాప్ లేదా నెట్‌బుక్ కన్నా కూడా సన్నగా, తేలికగా ఉండే ఐప్యాడ్‌లో 9.7 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. వైఫై నెట్ సర్ఫింగ్ చేయడానికి బ్యాటరీ 10 గంటల దాకా పనిచేస్తుంది. అదే 3జీ డేటా నెట్‌వర్క్‌లోనైతే 9 గంటల దాకా బ్యాటరీ పనిచేస్తుంది. ఇందులో మల్టీ టచ్ యూజర్ ఇంటర్‌ఫేస్, వెబ్ బ్రౌజింగ్, ఈ మెయిల్స్, ఫోటో షేరింగ్స్, హైడెఫినెషన్ వీడియోస్, మ్యూజిక్, గేమ్స్, ఈ-బుక్స్ వంటి ఎన్నో సదుపాయులు ఇందులో ఉన్నాయి. 9 నెలల క్రితం అమెరికాలో విడుదలైన ఐప్యాడ్ అతి తక్కువ సమయంలోనే దాదాపు 150 లక్షల ఐప్యాడ్‌లు అమ్ముడై రికార్డు సృష్టించాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...