‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టు రద్దు
తిరుమల,జనవరి 20 : వివాదాస్పద ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని తీర్మానించింది. ప్రాజెక్టు కోసం దాతలిచ్చిన 95 కేజీల బంగారాన్ని, రూ.12 కోట్లను వారు కోరితే వాపసు చేస్తారు. లేదంటే శ్రీవారికి అవసరమైన ఆభరణాల తయారీకి బంగారాన్ని వినియోగిస్తారు. నగదును ఇతర ట్రస్టులకు బదిలీ చేస్తారు. బంగారం, నగదు వాపసు తీసుకోకుంటే దాతలకు గతంలో ప్రకటించిన విధంగా బస, దర్శనం, ఇతర మర్యాదల వంటి సౌకర్యాలను యథావిధిగా అమలు చేస్తారు. అథారిటీ చైర్మన్ జె.సత్యనారాయణ, ఈవో కృష్ణారావు, సభ్యుడు నాగిరెడ్డి నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
Comments