తిరుమల,జనవరి 20 : వివాదాస్పద ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని తీర్మానించింది. ప్రాజెక్టు కోసం దాతలిచ్చిన 95 కేజీల బంగారాన్ని, రూ.12 కోట్లను వారు కోరితే వాపసు చేస్తారు. లేదంటే శ్రీవారికి అవసరమైన ఆభరణాల తయారీకి బంగారాన్ని వినియోగిస్తారు. నగదును ఇతర ట్రస్టులకు బదిలీ చేస్తారు. బంగారం, నగదు వాపసు తీసుకోకుంటే దాతలకు గతంలో ప్రకటించిన విధంగా బస, దర్శనం, ఇతర మర్యాదల వంటి సౌకర్యాలను యథావిధిగా అమలు చేస్తారు. అథారిటీ చైర్మన్ జె.సత్యనారాయణ, ఈవో కృష్ణారావు, సభ్యుడు నాగిరెడ్డి నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment