సచిన్ కు పాండిచ్చేరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
చెన్నై, జనవరి 26: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు పాండిచ్చేరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. ఈ మేరకు పాండిచ్చేరి యూనివర్సిటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సచిన్ టెండూల్కర్తో పాటు నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్, వైద్య రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ చెళియన్లకు డాక్టరేట్లు అందజేయనున్నట్లు తెలిపింది. పాండిచ్చేరి యూనివర్సిటీ స్నాతకోత్సవం రోజున డాక్టరేట్లను అందజేయనున్నట్లు పేర్కొంది. స్నాతకోత్సవం మార్చి లేదా ఏప్రిల్లో ఉంటుందని వెల్లడించింది.
Comments