హైదరాబాద్, జనవరి 26: : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మహనీయుల కలలు ఫలించేలా రాష్ట్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక కవాతు బృందాలను ప్రత్యేక వాహనంలో తిలకించారు. 2004 నుంచి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు, సాధించిన విజయాలను గుర్తు చేశారు.ప్రాంతీయ, సమైక్య ఉద్యమాలతో రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన్నిపరోక్షంగా ప్రస్తావిస్తూ, శాంతిభద్రతల స్థాపనకు అంతా సహకరించాలని పిలుపు పిలుపు ఇచ్చారు. ‘స్వాతంత్య్రానంతరం జాతి నిర్మాణంలో రాష్ట్రం గణనీయమైన పాత్ర పోషించింది. పారిశ్రామికంగా మంచి ప్రగతి సాధించింది. దీనితోనే తృప్తి చెందకూడదు. ప్రజలంతా పరిపక్వతతో వ్యవహరించాలి. అన్ని రకాల హింసా పద్ధతుల్నీ తరిమికొట్టాలి. ప్రజాజీవనం సాఫీగా సాగేందుకు సహకరించాలి. ఫిబ్రవరి 9-28 మధ్య చేపట్టే రెండో విడత జన గణనకు పూర్తి సమాచారమివ్వాలి’’ అని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment