Monday, January 31, 2011

జగన్ వర్గానికి చెక్...చిరు కు కాంగ్రెస్ గొడుగు...!

* సోనియా  దూతగా చిరుతో ఆంటోనీ మంతనాలు
* ఢిల్లీకి  ఆహ్వానం
* రాష్ట్రంలో 4 మంత్రిపదవుల ఎర
* అరవింద్ కు రాజ్యసభ సీటు
* చిరు కు కూడా కెంద్రమంత్రి పదవి 
హైదరాబాద్,జనవరి 31: :బడ్జెట్ సమావేశాల కంటే ముందే రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రజారాజ్యం పార్టీని భాగస్వామి చేయడం పై కాంగ్రెస్ అథిస్టానం దౄష్టి పెట్టింది. సోనియా  దూతగా హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ  పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ను వెంటబెట్టుకుని నేరుగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇంటికి వెళ్ళి ఈ విషయం చర్చించినట్టు సమాచారం. చిరంజీవితో ఏకే ఆంటోని సుమారు గంటన్నర సేపు సమావేశమయ్యారు.  ముక్యంగా జగన్ వర్గం బెదిరింపులకు చెక్ పెట్టడానికే పి.ఆర్.పి. ని క్యాబినెట్‌లోకి ఆకర్షించాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా, చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించడానికే రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హైదరాబాదు వచ్చారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు. సోనియాను కలవాలని ఆంటోనీ చిరంజీవికి చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆంటోనీ, చిరంజీవి భేటీలో రహస్యమేమీ లేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో చేరే విషయంపై చర్చ జరగలేదని, రెండు పార్టీలు కలిసి పనిచేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు.సోనియా ఆహ్వానం మేరకు చిరంజీవి త్వరలోనే న్యూఢిల్లీకి వెళ్లనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ, పీఆర్పీల మధ్య స్నేహం బలపడటానికి ఏఐసీసీ ప్రతినిధిగా చర్చలు జరిపానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని  మీడియాకు తెలిపారు.  చర్చల కోసం చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వనించామని తెలిపారు. మరోవైపు జగన్ వర్గానికి చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపై వేటు వేసి ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురైదుగురు శానససభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేర్చుకునే  అవకాశాలున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సి. రామచంద్రయ్య కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...