Saturday, January 29, 2011

క్లియ్‌స్టర్స్ కు మహిళల సింగిల్స్ టైటిల్‌

మెల్‌బోర్న్,జనవరి 29: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల  సింగిల్స్ టైటిల్‌ను బెల్జియంకు చెందిన  కిమ్ క్లియ్‌స్టర్స్ కైవసం చేసుకుంది. శనివారమిక్కడ జరిగిన ఫైనల్స్ లో  చైనాకు చెందిన లీ నాపై 3-6, 3-6, 3-6 తేడాతో గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనున్న లీ నా ఆశలపై క్లియ్‌స్టర్ నీళ్లు చల్లింది. వరుస సెట్లతో ఓడించి కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను క్లియ్‌స్టర్ సాధించింది.
ఫైనల్లో ఓడిన పేస్, భూపతి జోడి
 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ సిరీస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన లియాండర్ పేస్, మహేష్ భూపతి జోడి పరాజయం పాలయింది. బయాన్ బ్రదర్స్ చేతిలో 3-6, 4-6 తేడాతో పేస్, భూపతి జంట ఓడిపోయింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...