తిరువనంతపురం,జనవరి 31 : శబరిమలలోని మకరజ్యోతి అంశంపై జరుగుతున్న చర్చలకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెరదించింది. మకరజ్యోతి మానవ సృష్టే అని, అయితే దీని వెనుక హిందూ విశ్వాసాలున్నాయని స్పష్టంచేసింది. ‘పొన్నబలమేడు వద్ద మనుషులు కాగడా పట్టుకొని ఉంటారన్న విషయం చాలామందికి తెలిసిoదేనని, దీన్ని టీడీబీ కూడా గుర్తించిందని బోర్డు అధ్యక్షుడు ఎం.రాజగోపాలన్ నాయర్ సోమవారమిక్కడ చెప్పారు. జ్యోతిపై మతపరమైన విశ్వాసాలున్నందున ఇది మానవ సృష్టేనంటూ బోర్డు ప్రచారం చేపట్టదన్నారు.ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 102 మంది మరణించిన నేపథ్యంలో మకరజ్యోతి మానవ సృష్టా లేక ఖగోళ అద్భుతమో స్పష్టం చేయాలని కేరళ హైకోర్టు టీడీబీని ఆదేశించడం తెలిసిందే. పూజలు, నిర్మాణం తదితర అంశాలపై బోర్డు సోమవారం సమావేశం నిర్వహించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment