ఎమ్మెల్యేలు ' చే'జారకుండా సీ.ఎం. వ్యూహం!

హైదరాబాద్,జనవరి 27: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ కు వ్యతిరేకంగా  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులను వెనక్కి రప్పించేందుకు వారితో కౌన్సెలింగ్ ప్రారంభించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.  ఖమ్మం జిల్లా  కు చెందిన జగన్‌వర్గ ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు బుధవారం  ముఖ్యమంత్రిని కలిశారు. వారిని ఖమ్మం జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చారు. అదే విధంగా తన సొంత జిల్లా చిత్తూరులో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, రవిలను బుజ్జగించే బాధ్యతను మంత్రి రఘువీరారెడ్డి తన భుజానికెత్తుకున్నారు. కుతూహలమ్మ తనతో సీఎం నేరుగా మాట్లాడాలని డిమాండ్ చేస్తే రవి మాత్రం మెత్తపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు