రాష్ట్రంలో 'గవర్నర్' పాలన !

హైదరాబాద్,జనవరి 18: రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి నుంచి బయటపడేందుకు అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కొంతకాలం గవర్నర్ పాలన విథించడంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ స్వయంగా ఈ సూచనతో యూపీఎ ఛైర్ పర్సన్‌కు ఓ రహస్య నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగాజగన్ వైపు వెళుతున్న ఎమ్మెల్యేల తోకలు కత్తిరించేందుకే కాంగ్రెస్ హై కమాండ్ పలు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తొందని చెబుతున్నారు. కర్నాటకలో యడ్యూరప్ప సర్కార్‌ను కూలదోసేందుకు స్వపక్ష నేతలే విపక్షంతో కలిసి వ్యూహ రచన చేసిన సమతంలో యడ్యూరప్ప అత్యంత చాకచక్యంగా స్పీకర్ చేత విపక్షంతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలతోపాటు స్వతంత్ర అభ్యర్థులపై అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఎదురు తిరుగుతున్న 24 మంది ఎమ్మెల్యేలపై ప్రయోగించాలన్న ప్రత్యామ్నాయం కూడా పరిశీలనలో ఉందట. అయితే జగన్ వెనుక ఇపుడు కనబడుతున్న 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాక మరో 70 మంది ఎమ్మెల్యేలున్నారని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి చెప్పడంతో హై కమాండ్ అయోమయంలో పడిందంటున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు