Monday, January 24, 2011

భారత రత్న భీమ్‌సేన్ జోషీ కన్నుమూత

పూనె,జనవరి 24: ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాన్సుడు భారత రత్న భీమ్‌సేన్ జోషీ సోమవారం ఉదయం కన్నుమూశారు. పూణేలోని సహ్యాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. డిసెంబర్ 31వ తేదీన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. గత కొంత కాలంగా వయస్సుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు 2008లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి.  కర్ణాటకకు చెందినభీమ్‌సేన్ జోషీ 1922 ఫిబ్రవరి 22వ తేదీన కర్ణాటకలోని గదగ్‌లో జన్మించారు. మిలే సుర్ మేరా తుమ్హారా అనే దేశభక్తి గీతంతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. ఆయన హిందీ, కన్నడ చిత్రాల్లో పాటలు కూడా పాడారు. హీందీలో సంగీత ప్రధానమైన బసంత్ బిహారీ వంటి సినిమాలకు పాటలు పాడారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...