Sunday, January 23, 2011

వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా కైవసం

సెంచూరియన్,జనవరి 23: భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-2 తేడాతో గెల్చుకుంది. చివరి వన్డేలో టీమిండియాపై దక్షిణాఫ్రికా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 40.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటయింది. 74 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న టీమిండియా యూసఫ్ పఠాన్ సెంచరీతో గౌరవప్రదమయిన స్కోరు సాధించింది. పఠాన్ విజృంభణతో విజయంపై ఆశలు చిగురించాయి. 70 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగులు చేసిన పఠాన్ అవుటవడంతో మ్యాచ్ సఫారీల వశయయింది. చివర్లో జహీర్‌ఖాన్ మునాఫ్ పటేల్ కొద్దిసేపు పోరాడిన ఫలితం లేకపోయింది. జహీర్ 24 పరుగులు చేసి చివరి వికెట్‌గా అవుటయ్యాడు.దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కల్ 4 వికెట్లు పడగొట్టాడు. స్టెయిన్, సాట్‌సోబ్ రెండేసి, బోదా, పీటర్సన్ ఒకోక వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఆమ్లా (116) సెంచరీతో రాణించాడు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 268 పరుగులుగా నిర్ణయించారు. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మోర్కల్‌కు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డులు దక్కాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...