అదుపు తప్పిన ఈజిప్ట్
కైరో,జనవరి 30: ఈజిప్ట్ లో దేశాధ్యక్షుడు హోస్నీ ముబారక్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. సైన్యాధికారులు కూడా తమ యూనిఫాంలను త్యజించి ఉద్యమమార్గం పట్టారు. న్యాయాధిపతులు సైతం ముబారక్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. మరోవైపు, దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా తీసుకున్న ఆరాచకశక్తులు గృహ దహనాలకు, బ్యాంకులు, స్వర్ణాభరణాల షాపులు, దుకాణ సముదాయాల లూటీలకు తెగబడ్డారు. 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కైరోలో ఉంటున్న భారత సంతతికి చెందిన వారిని భారతదేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనేకమంది భారత సంతతికి చెందినవారు విమానాశ్రయాలలో చిక్కుకున్నారు. పిరమిడ్ల సందర్శనకు వచ్చిన పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు

Comments