Wednesday, January 19, 2011

కొత్త మంత్రులు ఇద్దరే:మరో నలుగురికి ప్రమోషన్ : ఆంథ్ర నుంచి ఎవరూ లేరు...

జైపాల్ రెడ్డికి పెట్రోలియం శాఖ  

న్యూఢిల్లీ,జనవరి 19: కేంద్ర మంత్రి వర్గంలోకి కొత్తవారిని తీసుకోవడంతోపాటు కొందరి శాఖలను మార్చారు. మన రాష్ట్రానికి చెందిన ఎవరికీ కొత్తగా మంత్రి పదవులు దక్కలేదు. తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె పార్టీలకు స్థానం దక్కలేదు. మొత్తం ఆరుగురు ప్రమాణస్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రస్తుత సహాయ మంత్రులు  ప్రఫుల్ మనోహర్ బాయ్ పటేల్, శ్రీప్రకాష్ జైశ్వాల్, సల్మాన్ ఖుర్షీద్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తిగల సహాయ మంత్రిగా మరో ప్రస్తుత సహాయ మంత్రి  బేణీ ప్రసాద్ వర్మప్రమాణం చేశారు. కొత్త సహాయ మంత్రులుగా అశ్వని కుమార్, కె.సి.వేణుగోపాల్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ స్వల్ప స్థాయిలోనే జరిగిందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. పరిమిత సంఖ్యలో మాత్రమే కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని ప్రధాని చెప్పారు. పులు కాగా మంత్రుల శాఖలలో కూడా మార్పులు చేశారు. పెట్రోలియం శాఖ జైపాల్ రెడ్డికి, పట్టణాభివృద్ది శాఖ కమల్ నాథ్ కు, భారీ పరిశ్రమల శాఖ ప్రఫుల్ల కుమార్కు, జలవనరుల శాఖ సల్మాన్ ఖుర్షీద్ కు కేటాయించారు. కపిల్ సిబాల్ కు టెలికం, మానవ వనరుల శాఖలను, మురళీదేవరాకు కార్పోరేట్ వ్యవహారాలను, సిపి జోషీకి , రోడ్లు, రవాణా శాఖ ను కేటాయించారు. వాయిలార్ రవికి పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్ కు పంచాయతీ రాజ్ శాఖని కేటాయించారు. బేణీ ప్రసాద్ వర్మని ఉక్కు శాఖకు స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రిగా నియమించారు. కె.వి థామస్ కు స్వతంత్ర హొదా ఇచ్చారు. కెపి గిల్ కు గణాంక వ్యవహారాలను కేటాయించారు. జితిన్ ప్రసాద్ రవాణ శాఖ సహాయ మంత్రిగా, అజయ్ మాకెన్ క్రీడల శాఖ సహాయ మంత్రిగా, అశ్వని కుమార్ ప్లానింగ్, పార్టమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...