Tuesday, January 25, 2011

ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ !

లక్నో,జనవరి 25: జాతిపిత మహాత్మాగాంధీని కించపరుస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అబితాబ్ ఠాకూర్ ఇటీవల గోమతి నగర్ పోలీస్‌స్టేషన్‌లో దీన్ని నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లోని ‘ఐ హేట్ గాంధీ’ గ్రూప్ నెటిజన్లు మహాత్ముడిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఠాకూర్ ఆరోపించారు. ఫేస్‌బుక్‌తోపాటు ఈ గ్రూప్‌లోని రాహుల్ దేవ్‌గన్, గౌరబ్ ఛటర్జీ, రోహన్ షిండే తదితరుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...