ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ !

లక్నో,జనవరి 25: జాతిపిత మహాత్మాగాంధీని కించపరుస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అబితాబ్ ఠాకూర్ ఇటీవల గోమతి నగర్ పోలీస్‌స్టేషన్‌లో దీన్ని నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లోని ‘ఐ హేట్ గాంధీ’ గ్రూప్ నెటిజన్లు మహాత్ముడిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఠాకూర్ ఆరోపించారు. ఫేస్‌బుక్‌తోపాటు ఈ గ్రూప్‌లోని రాహుల్ దేవ్‌గన్, గౌరబ్ ఛటర్జీ, రోహన్ షిండే తదితరుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.   

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు