మే 8న ఎంసెట్

హైదరాబాద్,జనవరి 29:   ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్, డెంటల్, అగ్రికల్చర్ తదితర కోర్సులకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్-2011 మే 8వ తేదీన జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 10వ తేదీన పత్రికల్లో ప్రచురితమవుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి దరఖాస్తుల విక్రయం, స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఆలస్య రుసుము లేకుండా మార్చి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పోస్టాఫీసులు, ఆంధ్రా బ్యాంక్ బ్రాంచీలు, ఈ-సేవాకేంద్రాల్లో విక్రయిస్తారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు