ముంబై,జనవరి 27: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నివాసంపై దాడులు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ఆమె వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు రూ. 6 కోట్ల వరకు కనుగొన్నట్లు గురువారం వెల్లడించారు. దాదాపు రూ. 6 కోట్ల విలువ చేసే ఆస్తులకు ఎలాంటి లెక్కా పత్రాలు లేవని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే అధికారులు ఆ ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. ఆదాయపు పన్ను అధికారులు సోమవారం ప్రియాంకాతో పాటు మరో నటి కత్రీనా కైఫ్, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్, టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థలు మ్యాట్రిక్స్, బ్లింగ్లపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా కార్యదర్శి చాంద్ మిశ్రా నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment