విదేశాలలోని నల్లదనం 20 లక్షల కోట్లు: ప్రణబ్

న్యూఢిల్లీ,జనవరి 25: దేశం దాటిన నల్లదనం 20 లక్షల కోట్ల రూపాయలేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. విదేశాలలోని నల్లధనాన్ని మన దేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయిదు అంచలలో అమలు చేసే ఈ పథకం ద్వారా విదేశాలలోని నల్లధనాన్ని మన దేశానికి తీసుకువస్తామని మంత్రి చెప్పారు.నల్లధనంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బ్లాక్‌మనీ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో భారత్ ఇప్పటికే 22 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని, మరో 65 దేశాలతో ఒప్పందాలకు రంగం సిద్ధం చేసామని ప్రణబ్ పేర్కొన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు