Tuesday, January 25, 2011

విదేశాలలోని నల్లదనం 20 లక్షల కోట్లు: ప్రణబ్

న్యూఢిల్లీ,జనవరి 25: దేశం దాటిన నల్లదనం 20 లక్షల కోట్ల రూపాయలేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. విదేశాలలోని నల్లధనాన్ని మన దేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయిదు అంచలలో అమలు చేసే ఈ పథకం ద్వారా విదేశాలలోని నల్లధనాన్ని మన దేశానికి తీసుకువస్తామని మంత్రి చెప్పారు.నల్లధనంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బ్లాక్‌మనీ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో భారత్ ఇప్పటికే 22 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని, మరో 65 దేశాలతో ఒప్పందాలకు రంగం సిద్ధం చేసామని ప్రణబ్ పేర్కొన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...