Sunday, December 26, 2010

జీఎస్‌ఎల్‌వీ వైఫల్యంపై విశ్లేషణ

బెంగళూరు,డిసెంబర్ 26: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగ వైఫల్యంపై దేశంలోని అత్యున్నత అంతరిక్ష శాస్తవ్రేత్తలు విశ్లేషణ జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఏర్పాటు కానున్న వైఫల్య విశ్లేషణ కమిటీ ప్రయోగం తాలూకు సమాచారాన్ని విశ్లేషించి ఒక నివేదిక సమర్పిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికార ప్రతినిధి ఎస్.సతీశ్ తెలిపారు. ప్రయోగ విఫలంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ ఆదివారం శ్రీహరికోటలోని కల్పనా అతిథిగృహంలో సహచర శాస్తవ్రేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో రష్యా శాస్తవ్రేత్తలు కూడా పాల్గొన్నారు. దేశంలో సమాచార, ప్రసార, టెలివైద్య రంగాలకు మరింత ఊతమిచ్చే లక్ష్యంతో శనివారం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్06 రాకెట్ సాంకేతిక కారణాలతో తొలిదశలోనే విఫలమయింది. రాకెట్‌లో సంకేతాలను దిగువకు ప్రసారం చేసే తీగ ఒకటి తెగిపోవడం వైఫల్యానికి కారణమై ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. కాగా, రెండు వరుస వైఫల్యాలు ఏర్పడినంత మాత్రనా జీఎస్‌ఎల్‌వీ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఇస్రో మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ యు.ఆర్.రావు స్పష్టం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...