Tuesday, December 21, 2010
నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబు
హైదరాబాద్,డిసెంబర్ 21: హైదరాబాదులో నిమ్స్ లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సీనియర్ మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ మంగళవారం సాయంత్రం చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీక్ష విరమించాలని వారు చంద్రబాబును కోరారు. దీక్ష విరమిస్తే రైతులకు ఇచ్చే ప్యాకేజీ పెంపుపై చర్చిద్దామని మంత్రులు ఆయనకు చెప్పారు. రైతుల సాయం కోసం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాను దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. గత ఐదు రోజులుగా చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వైద్యాన్ని నిరాకరిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment