Tuesday, December 21, 2010

నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబు

హైదరాబాద్‌,డిసెంబర్ 21: హైదరాబాదులో నిమ్స్ లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సీనియర్ మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ మంగళవారం సాయంత్రం చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీక్ష విరమించాలని వారు చంద్రబాబును కోరారు. దీక్ష విరమిస్తే రైతులకు ఇచ్చే ప్యాకేజీ పెంపుపై చర్చిద్దామని మంత్రులు ఆయనకు చెప్పారు. రైతుల సాయం కోసం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాను దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. గత ఐదు రోజులుగా చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వైద్యాన్ని నిరాకరిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...