Wednesday, December 29, 2010

రెండో టెస్టులో భారత్ గెలుపు

దర్బన్,డిసెంబర్ 29:  రెండో టెస్టులో భారత్ 87 పరుగుల తేడాతో విజయం సాధించిఇంది.   మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్ ఆదివారం  నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా... నాలుగో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కలిస్ (52 బంతుల్లో 17; 2 ఫోర్లు), డివిలియర్స్ (76 బంతుల్లో 33; 1 సిక్సర్) అవుట్  అయ్యారు.  మొత్తం రెండు ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన హైదరాబాదీ ఆటగాడు  వీవీఎస్ లక్ష్మణ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...