Sunday, December 26, 2010

రెండో టెస్టులోనూ అదే వరస...

డర్బన్,డిసెంబర్ 26: రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది.  స్టెయిన్ (4/36), సోట్‌సోబ్ (2/40) ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది.  వర్షం కారణంగా తొలి రోజు ఆటను నిలిపి వేసే సమయానికి భారత్ ఆరు వికెట్లకు 183 పరుగులు సాధించింది. కెప్టెన్ ధోని (31 బంతుల్లో 2 ఫోర్లతో 20), హర్భజన్ సింగ్ (25 బంతుల్లో 2 ఫోర్లతో 15) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మేటి బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (32 బంతుల్లో 4 ఫోర్లతో 25), ద్రవిడ్ (68 బంతుల్లో 3 ఫోర్లతో 25), సచిన్ (22 బంతుల్లో 3 ఫోర్లతో 13), లక్ష్మణ్ (73 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఐదేళ్ల తర్వాత లక్ష్మణ్ టెస్టుల్లో సిక్సర్ కొట్టడం గమనార్హం. ఓవరాల్‌గా లక్ష్మణ్ టెస్టు కెరీర్‌లో కేవలం ఐదు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. ఆదివారం ఉదయం కురిసిన వర్షం కారణంగా మైదానం అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...