Saturday, December 18, 2010

ధోనీ సేన ముందు భారీ సవాల్...

సెంచూరియన్,డిసెంబర్ 18: : భారత్‌తో టెస్టు మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా రికార్డుల కోసం ఉపయోగించుకుంటోంది. తొలి ఇన్నింగ్స్ ను  4 వికెట్ల నష్టానికి 620 పరుగుల  వద్ద డిక్లేర్ చేసింది.కెరీర్‌లో 38 సెంచరీలు చేసిన కలిస్‌ డబుల్ సెంచరీ చేశాడు. డివిలియర్స్ ఏకంగా తమ దేశ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు.  సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో  భారత్  2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ 63 , గంభీర్ 80  పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి ద్రవిడ్ 28,  ఇషాంత్ 7 పరుగులతో  క్రీజులో ఉన్నారు. స్టెయిన్, హారిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...