జగన్ వెంట 'అనంత' ఎం.పి.?

హైదరాబాద్,డిసెంబర్ 16: కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమైన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. కోస్తా జిల్లాల్లో అలజడి సృష్టించిన జగన్ గురువారం రాయలసీమ లో హడావిడి చేశారు. కర్నూలులో కాంగ్రెసు శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూతురు వివాహ విందుకు హాజరైన ఆయన పలువురు కాంగ్రెసు శాసనసభ్యులను కలుసుకున్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో కూడా మంతనాలు జరిపారు. ఆ తర్వాత అనంతపురం వెళ్లి పలువురు నాయకుల కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఆయన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో ఆ పార్టీ నాయకులతో సమావేశమై తాను పెట్టబోయే పార్టీ గురించి మంతనాలు జరిపారు. అనంత వెంకట్రామి రెడ్డి ఇటీవలి దాకా వైయస్ జగన్ కు మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ ఇటీవల ఆయన మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో జగన్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.






Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు