Thursday, December 16, 2010

రైతుల రుణాలపై వడ్డీ మాఫీ

హైదరాబాద్‌,డిసెంబర్ 16:  ప్రకృతి వైపరీత్యాలు, అకాల నష్టాలకు గురైన రైతాంగాన్ని  ఆదుకోవటానికి రాష్ట్ర సర్కార్‌ ముందుకు వచ్చింది.  ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి గురువారం శాసనసభ శీతాకాల సమావేశాల ముగింపు రోజున రైతులకు కొన్ని రాయితీలు  ప్రకటిం చారు. బ్యాంకు నుంచి రూ.16,500 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారని, వాటిపై వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు.  పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.6,000 చెల్లిస్తా మన్నారు. గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు మరో రూ.1,500 పెంచామన్నారు. అలాగే గేదెలు, ఆవులకు రూ.15,000, దూడలకు రూ.10,000, గొర్రెలకు రూ.2,000, పౌల్ట్రీ రంగానికి రూ.40,000 చెల్లిస్తామని తెలిపారు. చేనేత రంగంలో మగ్గానికి రూ.5,000, రంగు మారిన, తడిసి పోయిన నూలుకు రూ.5,000 చెల్లిస్తామని, మత్స్యకార   పడవలకు రూ.5,000, పెద్ద పడవలు, వలలు నష్టపోయిన వారికి రూ.10,000 చెల్లిస్తామన్నారు.  మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ రాజ్‌, రోడ్లు, భవనాల శాఖలకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటికే రూ.810 కోట్లకు టెఎండర్లు పిలిచామన్నారు. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, ఇది వారి ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...