జగన్ వెంటే ఉంటాం: జివిత,రాజశేఖర్
హైదరాబాద్,డిసెంబర్ 20: వైఎస్ జగన్ చేపట్టనున్న నిరాహారదీక్షలో పాల్గొంటామని జీవిత, రాజశేఖర్ తెలిపారు. జగన్ వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరెడ్డిని చూసే తాము కాంగ్రెస్లో చేరామని వారు చెప్పారు. జగన్ను డైనమిక్ లీడర్గా వర్ణించారు. జగన్ లాంటి మనిషి సీఎం కావాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఇక భవిష్యత్ లేదని జీవిత, రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.

Comments