Wednesday, December 15, 2010

ఇండియన్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకున్న సైనా

హైదరాబాద్,డిసెంబర్ 15: నగరంలో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్ చివరి నిమిషంలో తప్పుకుంది. గాయమే ఇందుకు కారణమని చెబుతున్నా... ఇతర కారణాలూ ఉండొచ్చన్న వాదనలు వినపడుతున్నాయి. వాస్తవానికి సైనా ఈ ఏడాది పాల్గొనాల్సిన జాబితాలో ఈ ఇండియన్ ఓపెన్ ( లేదు. అయితే వేదిక హైదరాబాద్‌కు మారటంతో సైనాను తప్పనిసరిగా ఆడించాలని నిర్వాహకులు భావించారు. ఆమె కూడా అంగీకారం తెలిపింది. అయితే సరిగ్గా టోర్నీ ప్రారంభమయ్యే రోజు ఆమె అనూహ్యంగా తప్పుకోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం టోర్నీ ప్రారంభోత్సవం, ఆ తర్వాత మీడియా సమావేశంలో టైటిల్ గెలుస్తానని ఉత్సాహంగా ప్రకటించిన సైనా గాయం ఇప్పుడే బయటపడిందా అనేది సందేహంగా మారింది. టోర్నమెంట్‌నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నందుకు సైనా 250 డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ ఓపెన్‌నుంచి దూరమైన సైనా జనవరి మొదటివారంలో జరిగే సూపర్‌సిరీస్ ఫైనల్స్ లో కూడా పాల్గొనటం లేదు. జనవరి 18 నుంచి జరిగే మలేసియా సూపర్‌సిరీస్‌లో ఆమె బరిలోకి దిగుతుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...