Thursday, December 30, 2010
కృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెస్ 'లక్ష్మణరేఖ'
న్యూఢిల్లీ,డిసెంబర్ 30: : : శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నోరు విప్పవద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. ఆయన తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు గురువారం ఉదయం ఫోన్లు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏమీ మాట్లాడవద్దని, ఈ విషయంపై మీడియాకు దూరంగా ఉండాలని, ఇదే అధిష్టానం ఆదేశమని ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులతో చెప్పారు. పార్లమెంటు సభ్యులు ఏం మాట్లాడినా ప్రజలను రెచ్చగొట్టినట్లవుతుందని ఆయన అన్నారు.ఏమైనా చెప్పాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో గానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గానీ చెప్పాలని, బహిరంగంగా అభిప్రాయాలను వెల్లడించకూడదని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్సలు చేసినా, ఆందోళనకారులు విరుచుకుపడినా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. విమర్శలకు తగిన సమయంలో తగు విధంగా సమాధానం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులతో పాటు ఎవరూ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడకూడదని ఆయన హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment