కృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెస్ 'లక్ష్మణరేఖ'

న్యూఢిల్లీ‌,డిసెంబర్ 30: : : శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నోరు విప్పవద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర  కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. ఆయన తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు గురువారం ఉదయం ఫోన్లు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏమీ మాట్లాడవద్దని, ఈ విషయంపై మీడియాకు దూరంగా ఉండాలని, ఇదే అధిష్టానం ఆదేశమని ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులతో చెప్పారు. పార్లమెంటు సభ్యులు ఏం మాట్లాడినా ప్రజలను రెచ్చగొట్టినట్లవుతుందని ఆయన అన్నారు.ఏమైనా చెప్పాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో గానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గానీ చెప్పాలని, బహిరంగంగా అభిప్రాయాలను వెల్లడించకూడదని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్సలు చేసినా, ఆందోళనకారులు విరుచుకుపడినా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. విమర్శలకు తగిన సమయంలో తగు విధంగా సమాధానం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులతో పాటు ఎవరూ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడకూడదని ఆయన హెచ్చరించారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు