Thursday, December 16, 2010

తెలంగాణా వచ్చి తీరుతుంది: కె.సి.ఆర్. ధీమా

గురువారం వరంగల్ లో తెలంగాణా గర్జన కు హాజరైన జన సందోహం 
వరంగల్,డిసెంబర్ 16: తెలంగాణా ఉద్యమానికి అడ్డుపడేది తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులేనని వరంగల్ జరిగిన మహాగర్జన సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంత లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి, తనని నడిపించిన ఘనత ముమ్మాటికి ప్రజలదేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రాంతవారికి చెప్రాసీ ఉద్యోగం రాకుండా ఫ్రీజోన్ అంశమనే కొత్త నాటకానికి ప్రభుత్వం తెరతీస్తే తాను నిరాహారదీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. దీక్ష ఫలితంగా కేంద్రం దిగివచ్చి యాభై నాలుగు సంవత్సరాల పోరాటానికి ఫలితం వస్తే అందుకు సీమాంధ్ర నాయకులు గంట సేపట్లో ఏకమై మరోసారి తెలంగాణకు అడ్డుపడ్డారని ఆయన తెలిపారు. తదనంతర పరిస్థితుల తర్వాత తాను తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకుల్ని కలిసి ఏకం కావాలని కోరానన్నారు. సీమాంధ్ర నాయకులు రాజీనామా చేసినట్లే తెలంగాణ ప్రాంత నాయకులు రాజీనామా చేయాలని కోరితే అందుకు వారు వెనక్కి తగ్గారని, అలాంటి వారిని చవటలూ, దద్దమ్మలు అనకుంటే ఏమనాలి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల రాష్ట్ర గవర్నర్ చేసే వ్యాఖ్యల్ని కేసీఆర్ తప్పుపట్టారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ పారామిలటరీ దళాలను దించి ఉద్యమాన్ని అణిచివేస్తామని అరవిందరావు చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. మహాగర్జనకు వచ్చిన ప్రజా స్పందనను చూసి కేంద్రానికి సరియైన నివేదికిస్తే ఎలాంటి ఇబ్బందులుండవని ఆయన అన్నారు.తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఆశపడకుండా, అధిష్టానానికి బయట పడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలిచ్చే అభిమానం కన్నా పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు.

ఇంత పెద్ద జన సంద్రాన్ని తాను జీవితంలో చూడలేదని మహాగర్జన  సభలో పాల్గొన్న ఆర్యసమాజ్ ప్రతినిధి, సామాజిక వేత్త  స్వామి అగ్నివేష్‌ అన్నారు. తనది శ్రీకాకుళం జిల్లా అని, అయితే... న్యాయం వైపే మాట్లాDaతానని చెప్పారు. న్యాయం కోసం తెలంగాణకు తెలంగాణ తెచ్చుకుందామని స్వామి అగ్నివేష్‌ పిలుపునిచ్చారు. మహాగర్జన ద్వారా కేంద్రానికి అల్టిమేటం జారీ చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలని మహాగర్జన తీర్మానించిందని ఆయన ప్రకటించారు.

పోటెత్తిన జనం..

 తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్వహించిన తెలంగాణ మహాగర్జనకు జనం పోటెత్తారు.మహాగర్జన సభ సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థలను మూసేశారు. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించి వరంగల్ కు చేరుకున్నారు. ముంబై, సూరత్, ఔరంగాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. తెలంగాణ డెవలప్ మెంట్ తరఫున తెలంగాణ ఎన్నారైలు కూడా సభకు వచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి 20 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...