 |
| భారత్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు ధోనీ-స్మిత్ |
సెంచూరియన్ ,డిసెంబర్ 15: భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. సెంచూరియన్లో గురువారం మొదలయ్యే తొలి టెస్టుకు ఓ వైపు గాయాలు... మరో వైపు వాతావరణ పరిస్థితులు భారత్ను ఆందోళనలోకి నెడుతున్నాయి.తొలి మ్యాచ్ సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరగనుంది. బౌన్స్ ఎక్కువగా ఉండే వికెట్ను తయారు చేశారు. వాతావరణం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలమే అయినా... రెండు రోజులుగా ఆకస్మిక వర్షాలు ముంచెత్తాయి. 1991లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించింది. భారత - దక్షిణాఫ్రికా దేశాల మధ్య తొలిసారిగా టెస్ట్మ్యాచ్ 1992లో జరిగింది. అప్పటినుంచి ఇప్పుటి వరకు రెండు జట్ల మధ్య సఫారీ గడ్డపై మొత్తం 12 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అందులో దక్షిణాఫ్రికా ఆరు గెలవగా... భారత్ కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. మిగిలిన ఐదు టెస్టులు డ్రాగా ముగిసాయి. భారత్ ఇప్పడు అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాలో ఆ జట్టును ఓడించడటం పెద్ద సవాలే.
Comments