Wednesday, December 22, 2010

ఉల్లి తో లొల్లి...

న్యూఢిల్లీ,డిసెంబర్ 22: ఘాటెక్కుతున్న ఉల్లి ధర ను అదుపు చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. పదేళ్ల కిందట విదేశాల నుంచి ఉల్లి దిగుమతులపై సుంకాలను రద్దు చేసింది. ఎగుమతులపై వచ్చే ఏడాది జనవరి 15 వరకు విధించిన నిషేధాన్ని నిరవధికంగా పొడిగించింది. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. దిగుమతులను వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖకు హుకుం జారీచేసింది. అసాధారణంగా పెరిగిన ధరను తగ్గించేందుకు దిగుమతులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆశోక్ చావ్లా ఢిల్లీలో తెలిపారు. మళ్లీ ఆదేశాలు జారీ చేసేవరకు నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. దిగుమతి సుంకాలను ఎత్తేయడం వల్ల దేశంలో ఉల్లి సరఫరా పెరుగుందన్నారు. అయితే ఏ దేశం నుంచి ఎంత మొత్తంలో దిగుమతులు వస్తాయో ఆయన చెప్పలేదు. ఇదిలా ఉండగా వారం, పది రోజుల్లో కొత్త పంట వస్తుందని, ఫలితంగా ధరలు తగ్గుతాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి పీకే బసు చెప్పారు. ఎగుమతులపై నిషేధం ఫలితంగా ప్రధాన ఉల్లి మార్కెట్లలో హోల్‌సేల్ ధర 42% వరకు తగ్గింది. దేశంలో అతి పెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్‌లో బుధవారం క్వింటాలు రూ. 3,702 పలికింది. మంగళవారం ఈ ధర రూ. 5,200గా ఉంది. ముంబై, చెన్నై హైదరాబాద్ తదితర నగరాల్లో కిలో ఉల్లి ధర రూ. 50-85 మధ్య పలుకుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...