Tuesday, December 28, 2010

శాశ్వత పరిష్కారమే సూచిస్తాం: శ్రీక్రిష్ణ

న్యూఢిల్లీ,డిసెంబర్ 28:   ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితికి శాశ్వత పరిష్కారం దిశగా తమ నివేదిక ఉంటుందని ఆశిస్తున్నామని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులకు ఏర్పాటైన తమ కమిటీ నివేదికను సిద్ధం చేసిందని, నెలాఖరులోగా హోంమంత్రి చిదంబరానికి తప్పకుండా అందజేస్తుందని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపేందుకు ఏపీ భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్ శ్రీకృష్ణతో పాటు కమిటీ సభ్య కార్యదర్శి వి.కె.దుగ్గల్, సభ్యులు రవీందర్‌కౌర్, అబూసలే షరీఫ్, రణబీర్‌సింగ్‌తోపాటు కమిటీ సీనియర్ కన్సల్టెంట్ రవి ఢింగ్రా, కమిటీకి తోడ్పాటునందించిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి శశిప్రకాష్ పాల్గొన్నారు‘‘ఎక్కువమందికి అధిక సంతృప్తి కలిగించేలా నివేదికను తీర్చిదిద్దాం’’ అని శ్రీక్రిష్ణ సుస్పష్టంగా పేర్కొన్నారు.  తమ నివేదికలో పలు ప్రత్యామ్నాయాలు, వాటికున్న అనుకూలతలు, ప్రతికూలతలను కూడా పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్రంలో అదనపు బలగాలను మోహరించింది.. నివేదిక తర్వాత ఏదో జరుగుతుందని కాదని, ఏదీ జరగకుండా ఉండేలా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాటును ప్రభుత్వం చేసిందని వివరించారు.  రాష్ట్రంలో ఎలాంటి హింస చోటుచేసుకోదని గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు.  వివరాలు ముందుగా వెల్లడయ్యే ప్రశ్నే లేదన్నారు.. అరవై ఏళ్ల సమస్యకు పది నెలల్లో పరిష్కారం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు శ్రీకృష్ణ చమత్కారంగా జవాబిస్తూ.. ‘‘పాతికేళ్ల పాటు పిల్లలు లేని దంపతులకు తొమ్మిది నెలల్లోనే బిడ్డ పుడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...