Thursday, December 16, 2010

చప్పగా ముగిసిన అసెంబ్లీ...

హైదరాబాద్,డిసెంబర్ 16:   అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చప్పగా ముగిశాయి. మొత్తం 6 రోజులపాటు సభ సమావేశమైంది. 23 గంటల 25 నిమిషాలుపాటు సమావేశమైన సభ వివిధ అంశాలపై పెద్దగా చర్చ లేకుండానే ముగిసిఒది. ఉద్యమాల్లో విద్యార్థులపై కేసుల ఎత్తివేత, తుపానులో నష్టపోయిన రైతులకు సాయం.. వంటి రెండు అంశాలతోనే ఈ సమావేశాలు పరిసమాప్తమయ్యాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం రెండురోజులకే పరిమితమైంది. వాయిదా తీర్మానాల్లో దేనికీ చర్చకు అవకాశంరాలేదు.  ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుంది. ఏడాదిలో 52 రోజుల పాటు సభ కొనసాగాల్సి ఉన్నా.. ఈ ఏడాది 42 రోజులకే పరిమితమైంది.

నారా వర్సెస్ నల్లారి ...

చివరిరోజున సభ ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలతో దద్దరిల్లింది. ప్రతి పక్షనేత నారా చంద్రబాబు, సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీఎంగా నీ సత్తా ఏమిటో తెలిసిందని చంద్రబాబు అంటే... నీకు బీపీ ఎక్కువైంది, స్థాయి తెలుసుకుని మర్యాదగా మాట్లాడు అని సీఎం హెచ్చరించారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించలేక సిగ్గులేకుండా మహారాష్ట్ర తో లాలూచీ పడ్డారని చంద్రబాబు ధ్వజమెత్తగా... తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక బాబ్లీకి వెళ్లావని మంత్రి రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. నీ బాబ్లీ యాత్ర వల్ల రాష్ట్రం రూ. 20 లక్షలు మహారాష్ర్టకు చెల్లించాల్సి వచ్చిందని సీఎం దెప్పిపొడిచారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, పోడియంలో తెలుగుదేశం సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...