'హిందూ' వివాదంలో రాహుల్
న్యూఢిల్లీ,డిసెంబర్ 17 : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ చిక్కుల్లో పడ్డారు. అమెరికా రాయబారి రోమర్తో అతివాద హిందూ సంస్థలపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వికీలీక్స్ బయటపెట్టింది. హిందూ తీవ్రవాదంతోనే భారత్కు నష్టమని రాహుల్ వ్యాఖ్యానించిన టేపులను వికీలీక్స్ బయటపెట్టి సంచలనం సృష్టించింది. 2009 సంవత్సరంలో హిల్లరీ క్లింటన్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన విందులో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.
Comments