Monday, December 20, 2010

జగన్ దీక్షకు రంగం సిద్ధం...

హైదరాబాద్,డిసెంబర్ 20: రైతు సమస్యలపై మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 48 గంటల సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం మంగళవారం క్రిష్ణా తీరంలో ప్రారంభమవుతోంది. రైతులు, చేనేత కార్మికుల కోసం జగన్ చేయనున్న ఈ దీక్ష మంగళవారం ఉదయం సీతమ్మవారి పాదాల వద్ద ఇసుక తిన్నెలపై ప్రారంభం కానుంది. సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన దీక్షా ప్రాంగణానికి 'వైఎస్‌ఆర్ లక్ష్య దీక్షా ప్రాంగణం’గా పేరుపెట్టారు. ఇక్కడ 100 అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ వేదికపై సహచరులు, రైతులతో కలిసి యువనేత దీక్షలో కూర్చుంటారు. జగన్ లక్ష్య దీక్ష సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...