రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం: బాబు

హైదరాబాద్,డిసెంబర్ 30: రైతులకు న్యాయం జరిగేంతవరకూ రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చ ంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు ఎన్టీయార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతుగర్జన సభ లో లో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుంభకోణంలో కూరుకు పోయిందని ఆయన విమర్శించారు. 2జీ స్కామ్‌లో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, రైతులకోసం రెండు వేల కోట్ల రూపాయలను అడిగితే లేదన్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలున్నా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని బాబు డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు