Thursday, December 30, 2010

రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం: బాబు

హైదరాబాద్,డిసెంబర్ 30: రైతులకు న్యాయం జరిగేంతవరకూ రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చ ంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు ఎన్టీయార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతుగర్జన సభ లో లో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుంభకోణంలో కూరుకు పోయిందని ఆయన విమర్శించారు. 2జీ స్కామ్‌లో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, రైతులకోసం రెండు వేల కోట్ల రూపాయలను అడిగితే లేదన్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలున్నా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని బాబు డిమాండ్ చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...