Friday, December 17, 2010

భారతీయ సైన్స్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు

వాషింగ్టన్,డిసెంబర్ 17: భారత సీనియర్ పాత్రికేయుడు పల్లవ బాగ్లా ఈ ఏడాదికిగాను సైన్స్ జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు ‘డేవిడ్ పెర్ల్‌మన్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ సైన్స్ జర్నలిజం’ను అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో గురువారం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ‘ హిమనీనదాలపై వాతావరణ మార్పుల ప్రభావం’అన్న అంశంపై రాసిన వ్యాసాలకుగాను ఆయన ‘న్యూస్’ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...