కేంద్ర సమాచార కమిషన్ నూతన కమిషనర్గా సత్యానంద్ మిశ్రా
న్యూఢిల్లీ,డిసెంబర్ 14: కేంద్ర సమాచార కమిషన్ నూతన కమిషనర్గా సత్యానంద్ మిశ్రాను నియమించనున్నారు. ఈమేరకు ప్రధానమంత్రి మన్మోహన్ న్యాయ శాఖమంత్రి వీరప్పమొయిలీ, ప్రతిపక్షనేత సుష్మస్వరాజ్ పాల్గొన్న సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత కమీషనర్ ఎ.ఎన్.తివారీ పదవీకాలం ఈ నెల 19న ముగియనున్నది. 1973 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 61ఏళ్ల మిశ్రా గతంలో సిబ్బంది శిక్షణ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు.
Comments