Friday, December 17, 2010

పలు సమస్యలు, సవాళ్ల మధ్య కాంగ్రెస్ ప్లీనరీ

న్యూఢిల్లీ,,డిసెంబర్ 17: 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ 83వ ప్లీనరీ శనివారం ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్..సహా పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు హాజరయ్యే ఈ సమావేశాల్లో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సవాళ్లపై మేధోమథనం జరగనుంది. 2జీ, ఆదర్శ్ సహా ఇటీవల పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్న కుంభకోణాలు, యూపీఏలో విభేదాలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆంధ్రప్రదేశ్ పరిణామాలు, 2011, 2012లలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన.. ఇన్ని సవాళ్ల మధ్య 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏని మరోసారి విజయతీరాలకు చేర్చడం.. మొదలైన అన్శాలపై ఈ మూడురోజుల ప్లీనరీ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది.పార్టీ ఆవిర్భవించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేసే తీర్మానంతోపాటు రాజకీయ, ఆర్థిక, విదేశాంగ రంగాలపై చేయనున్న తీర్మానాల ముసాయిదాలు సిద్ధమయ్యాయి. శనివారం పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగే తొలి సమావేశంలో పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, పీసీసీ సారథులు, సీఎల్‌పీ నాయకులు ముసాయిదాలపై చర్చించి తుదిమెరుగులు దిద్దుతారు. పార్టీ ప్రతినిధు లు ఆది, సోమవారాల్లో వీటిపై చర్చించి, అవసరమైన మార్పులు చేసి వాటిని ఆమోదిస్తారు. ప్లీనరీ సమావేశాల ప్రాంగణం వద్ద నాలుగువేలమందికి బస ఏర్పాట్లు చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...