కరుణాకరన్ కన్నుమూత

తిరువనంతపురం,డిసెంబర్ 23:  కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు కె. కరుణాకరన్  అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. నాలుగు సార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధికకాలం ఆ పదవిని అధిరోహించిన వ్యక్తిగా తిరుగులేని రికార్డు నెలకొల్పారు. 1918, జులై 5న కేరళలోని కన్నూరులో జన్మించిన కరుణాకరన్ విద్యార్థి నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి 1970లో యుడీఎఫ్ నెలకొల్పడం ద్వారా కరుణాకరన్ పేరు గాంచారు. అంచలంచెలుగా ఎదిగి 1977లో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కొన్నాళ్ళు కేంద్రంలో పరిశ్రమల శాఖా మంత్రిగా కూడా పనిచేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు