కేసుల ఎత్తివేత:ఎంపీల దీక్ష విరమణ

హైదరాబాద్,డిసెంబర్ 28: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలలో నమోదైన కేసులు అన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు హొం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శాసనసభలో రాజకీయ పార్టీలు కోరిన మేరకు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. మొత్తం 8,047 మందిపై ఉన్న 1667 కేసులను ఎత్తివేస్తున్నట్లు ఆమె చెప్పారు. శాసనసభలో ప్రకటించిన ప్రకారం 565 కేసులు ఎత్తివేశామన్నారు. ఇప్పుడు 900 మందిపై ఉన్న 135 కేసులను ఎత్తివేసినట్లు తెలిపారు. ఇలావుండగా,విద్యార్థులపై నమోదు చేసిన కేసులు అన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేయడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు దీక్షలు విరమించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు