Monday, December 27, 2010

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్ష

హైదరాబాద్,డిసెంబర్ 27: ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని కోరుతూ సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షను విరమింపజేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జానారెడ్డి ఆధ్వర్యంలోని మంత్రుల బృందం రెండుసార్లు దీక్షా శిబిరానికి వచ్చి చర్చలు జరిపినప్పటికీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేసేదాకా దీక్ష విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఒకదశలో కేకే కాస్త మెత్తబడినట్లు కన్పించినప్పటికీ సర్వే సత్యనారాయణ సహా దీక్షా శిబిరం వద్ద నున్న నేతలు మాత్రం ‘‘చావనైనా చస్తామే తప్ప కేసులు ఎత్తివేయనిదే దీక్ష విరమించే ప్రసక్తే లేదు’’అని తేల్చి చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...