Thursday, December 16, 2010

భారత్-చైనా మధ్య 6 ఒప్పందాలు

  న్యూఢిల్లీ,డిసెంబర్ 16: 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ , చైనాదేశాలు నిర్ణయించాయి. చైనా ప్రధానమంత్రి వెన్ జియబావో, భారత్ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ల మధ్య జరిగిన భేటీ లో గ్రీన్ టెక్నాలజీ బది లీలో సహకారం, రెండు దేశాల్లోనూ ప్రవహిస్తున్న నదీజలాల సమాచార మార్పిడి, మీడియా, సాంస్కృతిక వారధిలకు సంబంధించిన ఒప్పందాలతో పాటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన మరో 2 ఒప్పందాలను రెండు దేశాలు కుదుర్చుకున్నాయి. వాణిజ్య అసమానతల తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చైనా హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లో భారత్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యలను వీలైనంత త్వరగా, శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. 2011ను ఇరుదేశాలు చైనా - ఇండియా ఎక్స్ఛేంజ్ సంవత్సరంగా ప్రకటించాయి. ఇందులో భాగంగా 500మంది భారతీయ యువకులు చైనా పర్యటిస్తారు. ఒక దేశానికి చెందిన డిగ్రీ, డిప్లొమాలకు మరో దేశంలో గుర్తింపునివ్వాలని, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. మాండరిన్ చైనీస్ భాషను సీబీఎస్‌ఈ పాఠశాలల సిలబస్‌లో చేర్చడాన్ని చైనా స్వాగతించింది.                           

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...