హైదరాబాద్,,డిసెంబర్ 17: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరవడంతో భక్తులు మూలవిరాట్టును దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. సింహాచలం, అన్నవరం, యాదగిరిగుట్ట, అహోబిళం, శ్రీశైలం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తిలోని వరదరాజ స్వామి దేవస్థానం, కాణిపాకం..తదితరఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాచలంలో గరుడసేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఉత్తర ద్వారం లో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులమంత్రోచ్ఛారణలు, దూప దీపాలు, గంటల మోత నడుమ తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తరద్వారాలు తెరుచుకోగానే శంఖు,చక్ర, గదాధారుడైన వైకుంఠరాముడు గరుడవాహన రూఢుడై భక్తులకు సాక్షాత్కరించాడు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా చూసిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment