వైష్ణవాలయాల్లో ముక్కోటి సందడి

హైదరాబాద్‌,,డిసెంబర్ 17:  వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరవడంతో భక్తులు మూలవిరాట్టును దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు.  సింహాచలం, అన్నవరం, యాదగిరిగుట్ట, అహోబిళం, శ్రీశైలం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తిలోని వరదరాజ స్వామి దేవస్థానం, కాణిపాకం..తదితరఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  భద్రాచలంలో గరుడసేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఉత్తర ద్వారం లో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులమంత్రోచ్ఛారణలు, దూప దీపాలు, గంటల మోత నడుమ తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తరద్వారాలు తెరుచుకోగానే శంఖు,చక్ర, గదాధారుడైన వైకుంఠరాముడు గరుడవాహన రూఢుడై భక్తులకు సాక్షాత్కరించాడు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా చూసిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు