Friday, December 24, 2010

బొల్లారం విడిదికి రాష్ట్రపతి

హైదరాబాద్, డిసెంబర్ 24: రాష్టప్రతి ప్రతిభా పాటిల్ దక్షిణాది విడిది కోసం శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్టప్రతికి గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డి.కె.అరుణ, హైదరాబాద్ మేయర్ బండ కార్తీకరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.ప్రసాద్, డీజీపీ అరవిందరావులతోపాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.కాగా, రాష్టప్రతికి 27వ తేదీన ముఖ్యమంత్రి ఇవ్వనున్న విందును ప్రభుత్వం రద్దు చేసింది. వరదలు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయిన నేపథ్యంలో రాష్టప్రతికి విందు ఇవ్వటం సమంజసం కాదని రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ నరసింహన్ రాష్టప్రతి గౌరవార్థం అల్పాహార విందు ఇవ్వనున్నారని, ఇందులో కేవలం రాష్టప్రతి, గవర్నర్, సీఎం మాత్రమే పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిభాపాటిల్ డిసెంబర్ 31 వరకు బొల్లారంలోని రాష్టప్రతి విడిదిలో గడుపుతారు. అనంతరం గోవా బయల్దేరి వెళ్తారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...