జగన్ లక్ష్య దీక్ష ప్రారంభం

విజయవాడ,డిసెంబర్ 21:రైతు సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం సీతమ్మ పాదాల వద్ద 48 గంటల లక్ష్య దీక్షను ప్రారంభించారు. అంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా దీక్ష ప్రాంగణానికి అభిమానులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భం గా జగన్ మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఈ ప్రభుత్వం మరచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేతులు జోడించి విన్నవిస్తున్నానని, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, పల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జయసుధ, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర రెడ్డి, రేఖా కాంతారావు, శోభానాగిరెడ్డి, గురునాధరెడ్డి, ఆళ్ల నాని, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, మారెప్ప, కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గండి బాబ్జీ, జ్యేష్ట రమేష్బాబు, జలీల్ ఖాన్, తోట గోపాల కృష్ణ, మాజీ ఎమ్మెల్సీలు సాంబశివరావు, సామినేని ఉదయభాను, వెంకట అప్పారావు, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, సినీనటులు రాజశేఖర్, జీవిత, రోజా, విజయచందర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పిసిసి మాజీ కార్యదర్నులు కొయ్య ప్రసాద రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, తెలుగుదేశం పార్టీ నేత మాకినేని పెద్ద రత్తయ్య తదితరులు జగన్ కు మద్దతుగా దీక్ష లో కూర్చున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు