రాష్ట్రానికి కేంద్ర బలగాలు

హైదరాబాద్,డిసెంబర్ 18: డిసెంబరు 31 తర్వాత ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపి అరవిందరావు హెచ్చరించారు. అంతర్యుద్ధం వంటి మాటలను ఎవరు ఉపయోగించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ముందుజాగ్రత్త చర్యగా కేంద్రాన్ని బలగాలను కోరామన్నారు. మొత్తం 50 కంపెనీల బలగాలను పంపమని అభ్యర్థించామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తే తమకేమీ అభ్యంతరం లేదనీ, కానీ రెచ్చగొట్టే విధంగా, హింసాత్మక ధోరణిని అవలంభిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ‘తెలంగాణ నేతలు మిమ్మల్ని బెదిరిస్తూ, హెచ్చరికలు చేస్తున్నారు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా ,బెదిరించటం తెలంగాణ నేతల ధర్మమని, పోలీసుల్ని నైతికంగా బలహీనం చేయటానికే అలా మాట్లాడతారని డీజీపీ వ్యాఖ్యానించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు నేపథ్యంగా జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేత విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని డీజీపీ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో పోలీసుల పాత్ర చాలా చిన్నదని, చట్ట ప్రకారం తాము పనిచేస్తామన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు