తెలంగాణ లోనూ మా పార్టీ ఉంటుంది: జగన్

హైదరాబాద్,డిసెంబర్ 19: తెలంగాణ ఇచ్చేది తాను కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆ ప్రాంతంలో తన పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాను  పెట్టబోయే పార్టీ లౌకిక భావాలతో ఉంటుందని, ముస్లింలకు నాన్న వైఎస్  తీసుకొచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ కు కట్టుబడతామని,  ఎన్‌డీఏ, యూపీఏలతో సంబంధం లేకుండా, లౌకిక భావాలు గల పార్టీగా తన  పార్టీ ఉంటుందని అని  కడపలో చెప్పారు.   ‘‘నాన్న నాకు నేర్పింది ఒక్కటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, వెనక్కు తగ్గకపోవడం. నేను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను’’ అని ముస్లిం మత పెద్దలకు భరోసా ఇచ్చారు. వైఎస్ మరణానంతరం సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానం తనను, తన కుటుంబాన్ని అవమానాలపాలు చేసి పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి కల్పించిన తీరును వారికి వివరించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు